
రాఖీ పౌర్ణమి సందర్భంగా గోదావరిఖని బస్టాండ్లో బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన రూట్లలో రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రైవేట్ వాహనదారులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల నుంచి డబుల్ రేట్లు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి.