
హార్ముజ్ జలసంధి వద్ద భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కడా ఇంధన కొరత ఏర్పడలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.
భారత్ తన ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్యను గతంలో ఉన్న 27 నుంచి 41కి పెంచుకుందని, అమెరికా ఇప్పుడు మనకు 67 శాతం ఎల్పీజీని సరఫరా చేస్తోందని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 1,07,000 ఇంధన రిటైల్ అవుట్లెట్లలో ఒక్కటి కూడా నిల్వలు లేక మూతపడలేదని, మౌలిక సదుపాయాల విస్తరణకు రూ. 84,000 కోట్లు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు.