
కొలంబోలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన 62 ఏళ్ల కోచ్ సుమిత్ ఫెర్నాండో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు.
ఈ ఘటనకు సంబంధించి 17 ఏళ్ల క్రికెటర్ను పోలీసులు అరెస్టు చేసి, ఆగస్టు 17 వరకు బాలల ప్రొబేషన్ కస్టడీకి తరలించారు.
సుమిత్ ఫెర్నాండో గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్కు పాఠశాల స్థాయిలో కోచ్గా, బ్లూమ్ఫీల్డ్ క్లబ్లో క్యూరేటర్గా పనిచేశారు.