
సింగరేణి సంస్థ తన హెడ్డాఫీస్ మరియు ఇతర కార్యాలయాల్లో 5 మెగావాట్ల రూఫ్-టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి రూ. 4 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులను ఆదా చేయనుంది.
కొత్తగూడెంలోని కార్పొరేట్ ఆఫీసులో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని, త్వరలో ఇతర ప్రాంతాల్లోనూ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతో పాటు, భవిష్యత్తులో మిగులు విద్యుత్తును విద్యుత్ శాఖకు విక్రయించేలా సింగరేణి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.