
బెల్జియం, ఆమ్స్టెల్వీన్ వేదికలుగా మూడు రోజుల్లో ప్రారంభం కానున్న మహిళల హాకీ ప్రపంచ కప్లో భారత జట్టు పాల్గొననుంది.
1974 నుండి ఇప్పటివరకు 15 సార్లు జరిగిన ప్రపంచ కప్లో భారత్ ఎనిమిది సార్లు మాత్రమే అర్హత సాధించగా, 1974లో సాధించిన నాలుగో స్థానమే అత్యుత్తమ ప్రదర్శన.
2018 లండన్ ప్రపంచ కప్లో రాణీ రాంపాల్ సారథ్యంలో భారత్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకోగా, 2022లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.