
జూన్ త్రైమాసికంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) రూ. 675.68 కోట్ల ఆదాయం, రూ. 118.79 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయంలో 101.82%, నికర లాభంలో 547.36% వృద్ధి నమోదైందని సంస్థ వెల్లడించింది.
2025-26 సంవత్సరానికి గాను రూ. 5 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 0.40 తుది డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది.