
నేపాల్లోని నువాకోట్ జిల్లాలో బుధవారం వచ్చిన భారీ వరదల నుంచి త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ హెడ్ మాస్టర్ రాజేంద్ర దావాడి 1,643 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు.
వరద హెచ్చరిక అందగానే విద్యార్థులను కొండపై ఉన్న రావి చెట్టు వద్దకు తరలించిన కొద్ది నిమిషాలకే మూడు అంతస్తుల స్కూల్ భవనం పూర్తిగా కొట్టుకుపోయింది.
ఈ దురదృష్టకర ఘటనలో స్కూల్ సిబ్బంది సంతోష్ పరియార్, సుల్తాన్ లామా వరద నీటిలో చిక్కుకుని మరణించారని అధికారులు ధృవీకరించారు.