
ముంబై నుంచి శ్రీనగర్ వచ్చిన ఇండిగో విమానం శుక్రవారం ఉదయం 9.02 గంటలకు ల్యాండ్ అయిన తర్వాత పార్కింగ్ బేలో స్తంభాన్ని ఢీకొట్టింది.
విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్స్ (వీడీజీఎస్) స్తంభాన్ని విమానం ఢీకొన్నప్పటికీ, ప్రయాణికులు మరియు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని సంస్థ తెలిపింది.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను మ్యానువల్ మెట్ల ద్వారా సురక్షితంగా దించామని, ఘటనపై విచారణకు ఆదేశించామని ఇండిగో అధికారులు వెల్లడించారు.