
తెలంగాణ సచివాలయంలో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిత్తల్ వద్ద పీఎస్గా పనిచేస్తున్న రాజు విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు.
అసెంబ్లీ ప్రాంగణంలో రాజు కుప్పకూలగానే మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం ఆసుపత్రికి తరలించినప్పటికీ, పల్స్ పడిపోవడంతో ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.