
టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ బెంగళూరు మెట్రోలో ఎటువంటి హడావుడి లేకుండా సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతర్జాతీయ క్రికెట్లో 300కి పైగా వన్డే వికెట్లు తీసిన శ్రీనాథ్, సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ నిరాడంబరంగా ఉండటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
శ్రీనాథ్ 1992 నుంచి 2003 వరకు నాలుగు ప్రపంచకప్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రెఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.