
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ. 52 కోట్లతో నిర్మించిన అన్నదాన నూతన భవనాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ఈ భవనంలో ఒకేసారి 800 మంది భక్తులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేశామని, మెకనైజ్డ్ కిచెన్ కోసం కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు.
దసరా పండుగ లోపు భక్తులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇంద్రకీలాద్రికి రెండో ఘాట్ రోడ్ ఏర్పాటుకు నివేదిక సిద్ధమవుతోందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.