
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న శాసన మండలి సమావేశాలకు హాజరు కావాలని కోరుతూ ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పిటిషన్పై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కౌంటర్ దాఖలు చేయనుండగా, ఆగస్టు 13న విచారణ జరగనుంది.