
హైదరాబాద్లోని ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ఈ అత్యాధునిక ఆసుపత్రిని మొత్తం 1,000 పడకల సామర్థ్యంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం సిద్ధం చేసింది.
సనత్నగర్ పరిధిలో అందుబాటులోకి వచ్చిన ఈ టిమ్స్ ఆసుపత్రి ద్వారా స్థానికులకు నాణ్యమైన వైద్యం తక్కువ ఖర్చుతో లభించనుంది.