
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కేవలం తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాల కోసమేనని రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు.
140 కోట్ల జనాభా అవసరాల కోసం భారత్ ఈ నిర్ణయం తీసుకుందని, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా కాదని ఆయన పేర్కొన్నారు.
పాశ్చాత్య దేశాల ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్కు అవసరమైనంత చమురు సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని అలిపోవ్ తెలిపారు.