
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల గురించి శుక్రవారం మంత్రి కొండా సురేఖ స్పందించలేదు.
రెండ్రోజుల క్రితమే ఈ విషయంపై తాను అన్ని విషయాలు చెప్పానని, ప్రస్తుతం కొత్తగా చెప్పడానికి ఏమీ లేదని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై మాట్లాడతానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.