విజయనగరం జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఉదయం 10:45 గంటలకు భోగాపురం చేరుకోనున్న ప్రధాని, 11:30 నుండి 12:55 వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
43 ఏళ్ల తర్వాత ఒక ప్రధానమంత్రి విజయనగరం జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.