
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పటిష్ఠ భద్రత నడుమ నిర్వహించేందుకు టీటీడీ 3 వేలకు పైగా హైఎండ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది.
అలిపిరి కాలినడక మార్గంలో ప్రత్యేకంగా 110 సీసీ కెమెరాలను అమర్చే పనులు జోరుగా సాగుతున్నాయి.
ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించి ఫేసియల్ రికగ్నిషన్, ఫైర్ డిటెక్షన్ వంటి ఆధునిక సాఫ్ట్వేర్లతో పర్యవేక్షించనున్నారు.