శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గినప్పుడు నరాలు అమితంగా ప్రేరేపితమై కండరాలు పట్టేయడం లేదా నరాలు లాగడం వంటి సమస్యలు వస్తాయి.
ఈ పోషక లోపం వల్ల కన్ను అదరడం, తీవ్రమైన తలనొప్పి, సరిగ్గా నిద్రపట్టకపోవడం, మూడ్ స్వింగ్స్ మరియు అధిక రక్తపోటు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
ఈ సమస్య నివారణకు గింజలు, డ్రై ఫ్రూట్స్, సంపూర్ణ ధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.