
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆగస్టు 17 నుంచి జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం నిర్వాహకులు కోతుల నివారణకు ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులను నియమించారు.
గత జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్ సమయంలో పావురాల వల్ల మ్యాచ్కు అంతరాయం కలగడంతో, ఈసారి పక్షుల నివారణకు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఈ చర్యపై స్టార్ షట్లర్ పీవీ సింధు స్పందిస్తూ, వింబుల్డన్లో డేగలను పహారాగా పెట్టినట్లుగానే నిర్వాహకుల ప్రయత్నాన్ని అభినందించాలని పేర్కొంది.