
సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ఒక క్యాబ్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అమీన్, అతని స్నేహితుడు మరియు క్యాబ్ ప్రయాణికుడికి స్వల్ప గాయాలు కాగా, వారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదం జరిగిన సమయంలో అమీన్ జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు వెళ్తుండగా, క్యాబ్ ఒక్కసారిగా మెయిన్ రోడ్డుపైకి రావడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.