
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి తెలంగాణ భవన్కు తరలించారు.
మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించగా, హైదరాబాద్ సీపీ సజ్జనార్ అసెంబ్లీ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు.
అభ్యంతరకర పదాలు ఉన్న టీషర్టులు ధరించడం వల్లే వారిని లోపలికి అనుమతించలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు.