
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది, నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.
స్థానిక జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం (NOC) చట్టబద్ధమైనదేనని, ప్రభుత్వ స్థలంలో నిబంధనల ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టడంలో తప్పులేదని సుప్రీం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఆకివీడులో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది, స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.