
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తాను స్వరపరిచిన 'ఎన్ ఇనియా పొన్ నిలవే' గీతం కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2026 మేలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఇళయరాజాకు సంగీత స్వరకల్పనపై హక్కు ఉన్నప్పటికీ, పాట సౌండ్ రికార్డింగ్, సాహిత్యంపై కాపీరైట్ లేదని పేర్కొంది.
సౌండ్ రికార్డింగ్కు సంబంధించిన హక్కులు చిత్ర నిర్మాత నుంచి సారెగామా ఇండియాకు బదిలీ అయ్యాయని, వారి అనుమతి లేకుండా పాటను మరో చిత్రంలో ఉపయోగించడం కుదరదని కోర్టు అభిప్రాయపడింది.