
పాఠశాల విద్యలో పారదర్శకత కోసం సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల జవాబు పత్రాలను వేరే పాఠశాల ఉపాధ్యాయుల చేత మూల్యాంకనం చేయించాలని డైరెక్టరేట్ ఆదేశించింది.
ప్రాథమిక విద్య పేపర్కు రూ. 2, ఉన్నత విద్య పేపర్కు రూ. 3 చొప్పున పారితోషికం చెల్లిస్తూ 3 నుంచి 5 రోజుల్లో ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలి.
పదో తరగతి మినహా మిగిలిన తరగతుల పరీక్షలు సొంత పాఠశాలల్లోనే జరిగినా, మూల్యాంకనం మాత్రం మండల రిసోర్స్ కేంద్రాల పర్యవేక్షణలో జరుగుతుంది.