కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువత విధ్వంసం వైపు కాకుండా దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రహదారుల కోసం రూ. 2,078 కోట్లు, మెగా వాటర్ గ్రిడ్ కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన వివరించారు.
సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, నిజానిజాలు తెలుసుకుని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని యువతకు ఆయన సూచించారు.