
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 51,952 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది.
విజయనగరం జిల్లాలో 709 మంది కార్మికులకు ఈ సాయం అందుతుండగా, చేనేత వస్త్రాల బ్రాండింగ్ కోసం పొందూరులో కొత్తగా ఒక క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వైద్యకళాశాల పనులను సాస్కీ నిధులతో త్వరగా పూర్తి చేస్తామని, సర్వజన ఆసుపత్రిని కూడా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.