
2023-24 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్కు చెందిన ఆరు చిన్న పార్టీలకు రూ.1,700 కోట్ల విరాళాలు అందినట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది.
ఆమ్ జన్మత్ పార్టీకి రూ.620 కోట్లు, సత్యవాది రక్షక్ పార్టీకి రూ.330.55 కోట్ల చొప్పున విరాళాలు అందగా, ఇవి కేవలం 15 లోక్సభ స్థానాల్లోనే పోటీ చేశాయి.
రాజకీయ కార్యకలాపాలు లేని ఈ పార్టీలు నిధుల మార్పిడికి వేదికగా మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.