
అమెజాన్ నిర్వహించిన 'బెస్ట్ ఇన్ టెక్' సర్వే ప్రకారం, 87 శాతం మంది ల్యాప్టాప్ కొనుగోలుదారులు బ్రాండ్ కంటే ప్రాసెసర్ పనితీరుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
సుమారు 40,000 మంది వినియోగదారుల అభిప్రాయాల మేరకు, 58 శాతం మంది ఏఐ ఫీచర్లు ఉత్పాదకతను పెంచుతాయని భావిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
ట్యాబ్లెట్ కొనేవారిలో 74 శాతం మంది డిస్ప్లే నాణ్యతకు మొగ్గు చూపుతున్నారని, 53 శాతం మంది మెరుగైన ఫీచర్లు ఉంటే బ్రాండ్ మారేందుకు సిద్ధమని తెలిపారు.