
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబి జిల్లా మనోరి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బాణసంచా కర్మాగార పేలుడులో 11 మంది మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో మరణించిన వారిలో ప్రియాంజలి, ప్రవీణ్ సింగ్, జహన్వి, ఆదిత్య, రవి, అంజు, జ్ఞాన్ సింగ్, విక్రమ్ సరోజ్, అన్ష్, నానా వంటి వారు ఉన్నారని పోలీసులు గుర్తించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.