
ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ గడువును కేంద్ర ఎన్నికల కమిషన్ పొడిగిస్తూ రివైజ్డ్ షెడ్యూల్ను విడుదల చేసింది.
ఓటర్ల జాబితాలో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు సీఈవో వివేక్ యాదవ్ తెలిపారు.
దాఖలైన అభ్యంతరాలను అక్టోబర్ 5లోపు పరిష్కరించి, అక్టోబర్ 9న రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు అధికారులు వెల్లడించారు.