
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏర్పాటు చేయనున్న రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (REMZ) సోలార్ ప్రాజెక్ట్ కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది.
ఎల్ఏ ఫేజ్-1 కింద సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన 37 మంది రైతులకు చెందిన 175.41 ఎకరాల భూమికి గాను రూ. 31,57,38,000 చెక్కులను అందజేశారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో ఈ పరిహార చెక్కులను రైతులకు పంపిణీ చేశారు.