
పశ్చిమాసియా దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ తన వంట గ్యాస్ (ఎల్పీజీ) దిగుమతుల్లో అమెరికా వాటాను పెంచుకుంటోంది.
2027 నాటికి తమకు అవసరమైన మొత్తం ఎల్పీజీ దిగుమతుల్లో 25 శాతం అమెరికా నుంచే కొనుగోలు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.