
సంతోష్ ధవాఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ చిత్రం 'గోంధల్' వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే ఆస్కార్ పోటీలకు నామినేట్ అయింది.
పోటీలో ఉన్న 30కి పైగా చిత్రాల నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
గోంధల్ అనేది మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సంప్రదాయ జానపద కళారూపం మరియు నృత్యం కావడం విశేషం.