
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులతో పాటు జడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈనెల 24వ తేదీతో ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గంతో పాటు ఎంపీటీసీల పదవీకాలం ముగియనుండటంతో కొత్త జిల్లాలకు జడ్పీ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నంద్యాల జిల్లాకు కొత్తగా జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు రానుండగా, ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని సిబ్బందిని జిల్లాల వారీగా సర్దుబాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.