
మధ్యప్రదేశ్ను ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ వాతావరణ మార్పుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.