
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
రాష్ట్రాల సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
సైబర్ భద్రతను బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.