
జమ్మూలోని ఖౌర్ సెక్టార్లో భారత సైనిక స్థావరాల వద్ద చక్కర్లు కొడుతున్న చైనా తయారీ పాకిస్థాన్ నిఘా డ్రోన్ను ఆర్మీ సిబ్బంది గుర్తించి కూల్చివేశారు.
కూలిపోయిన డ్రోన్ శకలాల నుంచి 64 జీబీ మైక్రో ఎస్డీ కార్డును స్వాధీనం చేసుకున్న అధికారులు, దానిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు.
గూఢచర్యం కోసం పాకిస్థాన్ ఈ డ్రోన్ను వినియోగిస్తున్నట్లు ఆర్మీ అధికారులు ఆరోపిస్తూ, దాని ప్రయాణ మార్గంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.