
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది.
ఈ వ్యాఖ్యలను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా తప్పుబట్టగా, కేసీఆర్ స్వయంగా సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
స్పీకర్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉందని, ఈ ఘటనపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు.