
రాష్ట్రంలో ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని 148 రోజుల్లోనే పూర్తి చేసిందని, దీనికి 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తెలిపారు.
డీఎస్సీ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని, టీసీఎస్ ఐయాన్ ప్లాట్ఫాం ద్వారా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు.