
ప్రైవేటు భూములను అన్యాయంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, కమీషన్ల కోసమే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆరోపించారు.
భూభారతి పోర్టల్ నుంచి నిషేధిత జాబితాను రాత్రికి రాత్రే తొలగించడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ సిబ్బందికి 18 నెలలుగా జీతాలు అందడం లేదని, వెంటనే బకాయిలను విడుదల చేయాలని హరీశ్రావు ఆదివారం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.