విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
ఆగస్టు 17 అర్ధరాత్రి నుండి విమాన రాకపోకలు ప్రారంభం కానుండగా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోడ్ 'వీటీజెడ్'ను భోగాపురానికి బదిలీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు 30 ఏళ్ల పాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.