
మునిపల్లి మండలం మేళసంఘం జిల్లా పరిషత్ పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి రోహిణి సస్పెండ్ చేశారు.
నిందిత ఉపాధ్యాయులు సంతకాలు మాత్రమే చేసి, పాఠాలు బోధించకుండా బయట తిరుగుతున్నట్లు విచారణలో తేలింది.
పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర సిబ్బందికి కూడా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.