
యూపీఐ లావాదేవీలపై వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని ఫోన్పే సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.
యూపీఐ సేవలు భారతీయ వినియోగదారులకు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని, డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
యూపీఐ వ్యవస్థను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచడం ముఖ్యమని, వ్యాపారులపై రుసుము విధించే విధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని నివేదికలు చెబుతున్నాయి.