
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
రూ. 10 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశించిన కోర్టు, షూరిటీలు సమర్పించాక వారిని విడుదల చేయాలని సూచించింది.
ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, అరెస్టు సమయంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.