
గత ఆర్థిక సంవత్సరం 2025-26లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.45,306.05 కోట్ల ఆదాయాన్ని సమీకరించింది.
ఈ మొత్తం ఆదాయంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.16,885.56 కోట్లు, ఆస్తుల నగదీకరణ ద్వారా రూ.28,420.49 కోట్లు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ ఛౌద్రి తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ లక్ష్యం రూ.80,000 కోట్లు కాగా, ఇప్పటివరకు పీఎస్ యూల వాటాల విక్రయం సహా మొత్తం రూ.59,083 కోట్లను ప్రభుత్వం సమీకరించింది.