
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం మెటా సంస్థకు బుధవారం నోటీసులు జారీ చేసింది.
ఈ వివాదాస్పద అంశంపై వివరణ ఇచ్చేందుకు మెటాకు పార్లమెంటరీ ప్యానెల్ మూడు రోజుల గడువును విధించింది.
వీడియో తొలగింపుపై మెటా సంస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పాలని పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేసింది.