
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా మొదటి కోచ్ తయారీ పూర్తయిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
వచ్చే ఏడాది బుల్లెట్ రైలును పరీక్షించనున్నట్లు మంత్రి వెల్లడించగా, 2027 నాటికి ఈ రైలు పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.
ఈ ప్రాజెక్టు ద్వారా నిర్ణీత స్టేషన్ల మధ్య వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.