
తెలంగాణ అసెంబ్లీలో సభకు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో బీఆర్ఎస్కు చెందిన పలువురు సభ్యులను బుధవారం సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
సస్పెన్షన్కు గురైన వారిలో హరీశ్రావు, జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, అనిల్ జాదవ్, కౌశిక్రెడ్డి సహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
సభలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.