సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యం మరియు గుండెపోటుతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
1985లో 'బాబాయ్ అబ్బాయ్' సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె, 'ఖడ్గం', 'గోలీమార్' వంటి 100కు పైగా చిత్రాల్లో నటించారు.
ఆమె అంతిమ సంస్కారాలను బుధవారం ఫిల్మ్నగర్ మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు 'మా' ప్రధాన కార్యదర్శి రఘుబాబు తెలిపారు.