
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం వద్ద ఒక ఇంటలోకి టాటా సఫారీ వాహనం దూసుకెళ్లిన ఘటనలో హరిత అనే మహిళ మృతి చెందింది.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.